Tuesday, 21 April 2026 03:16:56 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

కాంగ్రెస్ వేవ్ లో కొట్టుకుపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - జడ్చర్లలో జనం పల్లి అనిరుద్ రెడ్డి - దేవరకద్రలో గవినోళ్ళ మధుసూదన్ రెడ్డిల గెలుపు

కాంగ్రెస్ వేవ్ లో కొట్టుకుపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - జడ్చర్లలో జనం పల్లి అనిరుద్ రెడ్డి - దేవరకద్రలో గవినోళ్ళ మధుసూదన్ రెడ్డిల గెలుపు

Date : 03 December 2023 07:44 PM Views : 1834

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ వేవ్ లో అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ తో సహా దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్చర్లలో డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలు ఓటమిపాలయ్యారు. మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు కాంగ్రెస్ అభ్యర్థులను విజయం వరించింది. హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న నన్ను ప్రజలు ఆదరించి, అక్కున చేర్చుకుని మూడో సారి మళ్లీ గెలిపిస్తారని ధీమాలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రజలు ఇంటి బాట పట్టించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శ్రీనివాస్ గౌడ్ కు 67,736 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యేన్నం శ్రీనివాస్ రెడ్డికి 84,728 ఓట్లు పోలయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ పై యేన్నం శ్రీనివాస్ రెడ్డి 16,992 మెజార్టీతో గెలుపొందారు. దేవరకద్ర నియోజకవర్గం లో సౌమ్యుడుగా పేరున్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గవినోళ్ల మధుసూదన్ రెడ్డి 907 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డికి 87,002 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి గవినోళ్ళ మధుసూదన్ రెడ్డికి 87,909 ఓట్లు పోలయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. జనంపల్లి అనిరుద్ రెడ్డి కి 90,145 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డికి 75,515 ఓట్లు పోలయ్యాయి. జనంపల్లి అనిరుద్ రెడ్డి లక్ష్మారెడ్డి పై 14,630 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన యేన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో రెండున్నర ఏళ్ళు బిజెపి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన మధుసూదన్ రెడ్డి అనిరుద్ రెడ్డిలకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు వీరిద్దరూ కొత్తగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :