కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పాలన ప్రారంభించిన మొదటి రోజునే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒప్పంద ఉద్యోగం ఇచ్చి తనను అవమానించారని ఆముదాలపాడు మిథున్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి భవన్ కంచెలు తీసేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఒక్క సమస్య కూడా పరిష్కరించ లేదన్నారు. ఆర్టీసి ఇప్పటికే నష్టాల్లో ఉండగా ఉచిత హామీ వల్ల రోజు కోట్లల్లో నష్టం భరించాల్సి వస్తుందని, గత ఓ యస్ డి లు పైల్లు ఎత్తుకెళ్తుంటే ప్రభుత్వం చేస్టలుడిగి చూస్తోంది అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోని కేసులే కాకుండా భారాస అక్రమాలను ప్రశ్నించిన వారి పై బనాయించిన అక్రమ కేసులు కూడా ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. గత పాలకులచే కబ్జా కాబడ్డ ప్రభుత్వ, ప్రైవేటు భూములను వారి కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించాలన్నారు. డబుల్ బెడ్ రూముల అక్రమాల విషయంలో ప్రత్యేక అధికారినీ నియమించి విచారణ చేపట్టాలని కోరారు. వారం రోజుల్లో జరిగిన అక్రమాలపై ఏమ్మెల్యే విచారణ ప్రారంభించక పోతే భాజపా పోరుబాట పట్టాల్సి వస్తుంది హెచ్చరించారు. గత ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్లే ప్రజానీకం మార్పును ఆహ్వానించారు. ఆరు గ్యారెన్టీ లను ఏ విధంగా అమలు పరుస్తారో స్పష్టం చేయాలన్నారు. ఆర్టీసీ నీ ఏ విధంగా సంరక్షిస్తారో ప్రజలకు వివరించాలని కోరారు. గత పాలక వర్గ విధానాలను వ్యతిరేకించిన వారిపై నమోదైన కేసులను వెంటనే ఎత్తి వేయాలన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా భాజపా మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, మంచి చేస్తే ప్రశంశిస్తామన్నారు. ఎవరికి ఏ సమస్యా వచ్చిన పద్మావతి కాలనీ లో గల తన కార్యాలయం 24 గంటలపాటు సంప్రదించ వచ్చునని వారి సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు. ఫోన్ నంబరు 9989040123 కూడా ప్రజలు ఎప్పుడు సంప్రదించిన అందుబాటులో ఉంటానన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి. పడాకుల బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి .పి సత్యం, బుచ్చిరెడ్డి అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య, ఓబిసి మచ్చ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కే సతీష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు రాజు గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News