కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 25 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) ఎండ తాపం పెరుగుతున్న వేళ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కనీస నీడ కూడా దక్కకుండా “టెంట్” చుట్టూ చిల్లర రాజకీయాలు ముదురుతున్నాయనే విమర్శలు మహబూబ్నగర్లో వినిపిస్తున్నాయి. బస్టాండ్ ఎదురుగా ఉన్న 5 రూపాయల భోజన కేంద్రం వద్ద చినిగి పోయి వున్న టెంట్ స్థానంలో కొత్త టెంట్ ఏర్పాటు విషయంపై మున్సిపాలిటీ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డి స్వంతంగా ₹13 వేల రూపాయలు ఇచ్చి టెంట్ వేయాలని టెంట్ షాప్ యజమానికి 15 రోజుల క్రితమే సూచించినట్టు సమాచారం. సదరు టెంట్ షాప్ యజమాని 5 రూపాయల భోజన కేంద్రానికి పంపిన కుడా ఇప్పటికీ ఆ టెంట్ ఏర్పాటు కాకపోవడం, మున్సిపాలిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ( మానవత్వం తో ముందుకు వచ్చి న దాతలను కూడా అడ్డుకుంటున్నారు.) ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. :::: “నీడకైనా అనుమతులా..?” :::: పేదలకు తక్కువ ధరలో భోజనం అందించే కేంద్రం ముందు కనీస నీడ కల్పించడమే పెద్ద సమస్యగా మారిందా? “బతుకుదెరువు కోసం వచ్చిన వారికి ఎండలోనే కూర్చోమంటారా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. “చెట్టుకింద కూర్చోమన్నా చలికాలం, టెంట్ వేయొద్దన్నా ఎండకాలం” అన్నట్టుగా పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. :::: 13 వేల టెంట్… పై అక్కసు ఎవరికి..- పేరు వస్తుందని దురుద్దేశంతో అడ్డుకున్నారా.? :::: టెంట్ కోసం డబ్బులు ఇచ్చారు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా అమలు మాత్రం లేదు. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. మున్సిపాలిటీ అనుమతి లేకపోవడమే కారణమా? లేక “ఎవరు పెట్టారు?” వారికి పేరు వస్తుందన్న రాజకీయ లెక్కలేనా? పేదల అవసరాల కంటే పేరు ప్రతిష్టలే ముఖ్యమా.? అనే ప్రశ్న ప్రజల మదిలో తొలుస్తుంది. “ఒకరికి పేరు వస్తుందనే భయంతో టెంట్ కూడా వేయనివ్వకపోవడం ఎంతవరకు న్యాయం.?” “ఒక్క గిన్నె అన్నం తినే చోట కూడా రాజకీయాలు చేస్తే… ప్రజాసేవ ఎక్కడ?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ::: మున్సిపాలిటీ మౌనం – సందేహాల మబ్బులు ::: ఈ వ్యవహారంపై మున్సిపాలిటీ నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా కనిపించే “టెంట్” అంశం ఎందుకు ఇంత వివాదాస్పదమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అవసరం “నీడ”… కానీ అందిస్తున్నది “నేడూ – రేపూ” అనే రాజకీయ వాగ్దానాలేనా.? “ఒక ప్లేట్ అన్నం ముందు నీడ కూడా లేకపోతే… ఆ అభివృద్ధి ఎవరికోసం.?” 'ఇదేనా ప్రజా పాలనలోని మార్పు' మహబూబ్నగర్లో ఈ ప్రశ్నకు సదరు ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
Admin
Kalam Power News