Wednesday, 15 April 2026 09:10:37 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య

Date : 06 March 2026 02:17 PM Views : 69

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 6 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) : రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి ఎయిడ్స్ పై విద్యార్థుల ద్వారా సమాజంలో అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ డైట్ కాలేజ్ మెట్టుగడ్డలో పోస్టర్ మేళా ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విద్యాశాఖ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 84 పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ చర్యలు, ప్రజల్లో చైతన్యం కల్పించే అంశాలపై విద్యార్థులు రూపొందించిన పోస్టర్లను ప్రజెంట్ చేస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల సృజనాత్మకతతో రూపొందించిన పోస్టర్లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి జిల్లా డీఈఓ ప్రవీణ్ కుమార్, SCERT SRG మధుసూదన్ రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజు, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ మినాజుద్దీన్, ఏఏంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ సుధాకర్ రెడ్డి, డీఎస్ఓ షంషీర్ తదితరులు హాజరయ్యారు. అలాగే వివిధ పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి కల్పన (కేజీబీవీ హన్వాడ), రెండవ బహుమతి నందిని (జడ్పిహెచ్ఎస్ ఏదిరా), మూడవ బహుమతి బద్రీనాథ్ (జడ్పిహెచ్ఎస్ బాలుర మహమ్మదాబాద్) సాధించారు. వారి పోస్టర్ ప్రజెంటేషన్లు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, వారు సమాజానికి అవగాహన దూతలుగా మారాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :