Friday, 16 January 2026 07:50:29 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నీ 50 ఎకరాల భూమి అమ్మి ఉదండపూర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వు.. -ఉదండాపూర్ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో చెప్పిం

-ఎమ్మెల్యే హామీ మేరకు భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల పరిహారం ఇప్పించాలి -లక్ష్మారెడ్డి పై ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలు మానుకోవాలి హితవుపలికిన : జడ్పీ

Date : 03 March 2024 07:39 PM Views : 2834

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఎస్స్టిమేషన్ పెంచి వందల కోట్లు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దోచుకుతిన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించడం అర్ధరహితమని ఎమ్మెల్యేకు దమ్ముంటే ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ అయినా ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నే ఉన్నారని ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్ని వందల కోట్లు లక్ష్మారెడ్డికి ఇచ్చారో కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేత ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలని లేకుంటే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మహబూబ్ నగర్ జడ్పీ వైస్ చైర్పర్సన్, టిఆర్ఎస్ నేత కోడుగల్ యాదయ్య డిమాండ్ చేశారు. ఆధివారం జడ్చర్ల మాజీ ఎమ్మేల్యే సీ.లక్ష్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేల బృందం రెండు రోజుల క్రితం జరిపిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ల సంధర్శన సంధర్బంగా ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్చర్ల ఎమ్మేల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన తీవ్ర స్ధాయిలో ఖండించారు. రిజర్వాయర్ నిర్మాణంలో బాగంగా పెరిగిన ధరలకు అనుగూనంగా పెంచిన నిర్మాణ వ్యయం (ఎస్టీమేట్స్ ) ప్రభుత్వానికి సంభంధించినవి కాగా, అందులో ఎమ్మేల్యేకు ఏమి సంభంధం ఉంటుందన్నారు. దీనిపై అవగాహన లేకుండ ఎమ్మేల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని లేకుంటే తన 50 ఎకరాల భూమి అమ్మి డబ్బులు చెల్లిస్తానని భూ నిర్వాసితులకు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ముందు భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇప్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. జడ్చర్ల అభివృద్దిపై మాజీ ఎమ్మేల్యే మల్లురవి కూడ ఏనాడు వ్యక్తి గత ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. జడ్చర్ల అభివృద్దికి బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని తెలి పారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఏలాంటి అవినీతి జరిగినా భాద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హోదాను మరచి పౌరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగితే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ పాలెం సుధర్శన్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పిట్టల మురళీ, కౌన్సిలర్ సతీష్, టైగర్ నరసింహ, నాగిరెడ్డి, ఇంతియాజ్, వల్లూరు వీరేష్ శంకర్ నాయక్, తధితరులు ఉన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :