కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రక్కన వెలిసిన హజ్రత్ ఖాజా అబ్దుల్లా బిన్ సిద్ధిఖీ చీస్తి మిర్జాయి యాబా దర్గా 52 వ ఉర్సు ఉత్సవాలు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయని దర్గా సజ్జదా ముతవలి పీఠాధిపతి కిజర్ బిన్ హస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు,ఈ నెల 27 న గుసులే షరిఫ్ 28 న గంధోత్సవం (సందల్) సాయంత్రం 6:00 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై గంజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి కరెంట్ ఆఫీస్ రోడ్డు మీదుగా మదిన తులూం రోడ్డు నుంచి పేద్ద ఎత్తున దర్గా వద్దకు చేరుకుంటుందని పేర్కొన్నారు,గంధం సమర్పించిన అనంతరం అన్నదానం ఉంటుందని దర్గా పీఠాధిపతి కిజర్ బిన్ హస్సేన్ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హాజరవుతారని తెలిపారు,29 న దీపారాధన 30న ఖత్మే ఖూరన్ కార్యక్రమలు జరుగుతాయి అని పేర్కొన్నారు,ఈ ఉర్సు ఉత్సవాలకు జడ్చర్ల నియోజకవర్గం నుండే కాకుండా హైదరాబాద్, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పేద్ద ఎత్తున తరలి రావాలని కోరారు, దర్గాలో తమ మొక్కులు చెల్లిస్తారు అని అన్నారు, దర్గాలో ఆవరణలో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి కిజర్ బిన్ హస్సేన్ వెల్లడించారు,
Admin
Kalam Power News