Wednesday, 15 April 2026 09:04:33 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

“కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?”

- బిజేపి లో సమన్యాయానికి పెద్ద పీట పడేనా..!?. - డికె అరుణ నిర్ణయమేమిటి..?

Date : 19 March 2026 05:21 PM Views : 431

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 19 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొత్తగా కొలువుదీరిన కార్పోరేషన్‌లో ఈ పదవి నియామకంపై పార్టీ అంతర్గతంగా మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ లోపల వినిపిస్తున్న ప్రధాన అభ్యర్థుల పేర్లలో సీనియర్ నాయకుడు పాండురంగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన 21వ డివిజన్ కార్పొరేటర్ గుండ సంతోష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో బీజేపీ నాయకత్వంపై 'క్రియాశీల పదవుల్లో' “ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం” ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ డీకే అరుణ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో కీలక పదవులు అదే వర్గానికి కట్టబెట్టారనే అపవాదు పార్టీపై ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ ఎంపిక పార్టీకి కేవలం పదవి నియామకం కాకుండా, ఒక రాజకీయ సందేశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గుండ సంతోష్ పేరును ముందుకు తెచ్చే వర్గం బలపడుతోంది. గత 20 సంవత్సరాలుగా పార్టీ మారకుండా బీజేపీలోనే కొనసాగుతూ, కష్టకాలంలో కూడా పార్టీ కార్యకలాపాలను ముందుకు నడిపించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటూ, పార్టీకి స్థానిక స్థాయిలో బలమైన వాణిగా నిలిచిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గుండ సంతోష్‌ను ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేస్తే రెండు ప్రయోజనాలు సాధ్యమవుతాయి. ఒకవైపు బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుండగా, మరోవైపు “సామాజిక న్యాయం” పాటిస్తున్నామనే బలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో ప్రతిపక్షాలు కుల ఆధారిత విమర్శలు చేయడానికి అవకాశాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఈ నిర్ణయం కీలకంగా మారే అవకాశం ఉంది. కార్పోరేషన్ సమావేశాల్లో ప్రజల సమస్యలను బలంగా వినిపించే నాయకత్వం అవసరం ఉన్న నేపథ్యంలో, ఫీల్డ్ లెవల్‌లో పని చేసిన అనుభవం ఉన్న నాయకుడిని ఎంపిక చేయాలనే డిమాండ్ కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అయితే సీనియారిటీ, అనుభవం అనే అంశాలను ముందుకు తెచ్చే వర్గం కూడా పార్టీ లోపల బలంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఎలాంటి సమీకరణాలు చూసి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద చూస్తే, మహబూబ్‌నగర్ కార్పోరేషన్‌లో ఫ్లోర్ లీడర్ ఎంపిక కేవలం ఒక పదవి కేటాయింపుగా కాకుండా, పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించే రాజకీయ నిర్ణయంగా మారింది. సమన్యాయం, సామాజిక సమతుల్యత, పార్టీ కేడర్ విశ్వాసం - ఇతర అన్ని అంశాలను కలిపి చూస్తే గుండ సంతోష్ ఎంపిక పార్టీకి దీర్ఘకాలంలో లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :