కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 11 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “దొరలుతాగుఇప్పసారా తాగుదమేబాల.. మనం ఊగూదమేబాల..దొరలుతాగు.. ఇప్పసారా..దొరలుతాగు..ఇప్పసారా.. జడ్చర్ల గడ్డమీద...తాగి ఊగూదమే బాల.. ఊగూదమే బాల..!” అనే పాట విని కాంగ్రెస్ పార్టీలో నేతలు ప్రభావితం అయ్యారో ఏమో కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం "ఏం మార్పు రా బాబు ఇదే నా మనం కోరుకున్న మార్పు.!" అంటూ తెలంగాణ ప్రజానీకం బెంబే లెత్తి పోతుంది. సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిదులు ప్రజల అసలు సమస్యలు పక్కనబెట్టి “ఇప్పపూల సారా” మాటలే ప్రధాన చర్చగా మారడంపై జడ్చర్ల ప్రజలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న బాధాకర ఘటనలపై సోయి, స్పందన కనిపించకపోయినా, సారా అంశాలపై మాత్రం రాజకీయ చర్చలు సాగడం విచిత్రమని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన ఇప్పపూల సారా వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజల ప్రాణాలు, వారి గౌరవం కంటే ఇలాంటి అంశాలే ముఖ్యమా అనే ప్రశ్నను లేవనెత్తారు. “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదేమో!” అన్నట్లుగా పరిస్థితి మారిందని విమర్శిస్తున్నారు. గత వారం నాగసాల గ్రామానికి చెందిన దళిత యువకుడు భీమేష్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనను వారు గుర్తుచేశారు. బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక్కు..తిన్న ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినప్పటికీ కనీసం బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే కు సమయం దొరకలేదని, కానీ క్యాంపు కార్యాలయంలో "ఇప్పపూల సారా" అంశంపై విలేఖరుల సమావేశం నిర్వహించేందుకు మాత్రం సమయం కేటాయించారని వారు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. “ప్రజల కన్నీళ్లు ఎండకముందే రాజకీయ ప్రసంగాలు మొదలవుతాయా.?” అని ప్రశ్నించిన ప్రతి పక్ష పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రజల సమస్యలపై ముందుగా స్పందించడమేనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రశ్నించాల్సిన మీడియా ప్రతినిధులు కూడా మౌనం పాటించడం ఆశ్చర్యకరమని . దళిత యువకుడు భీమేష్ మృతి తర్వాత జడ్చర్లకు వచ్చిన ఎమ్మెల్యేను ఈ అంశంపై నిలదీయాల్సిన స్థానిక మీడియా ఎందుకు నిశ్శబ్దంగా నిలిచిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలు, వారి గౌరవం రాజకీయాల కంటే గొప్పవని, అలాంటి ఘటనలపై ముందుగా స్పందించడమే ప్రజాప్రతినిదుల కర్తవ్యమని పలువురు సూచిస్తున్నారు.
Admin
Kalam Power News