కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల పట్టణంలో పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న జమ్ములమ్మ గుడిసె గడిచిన మంగళవారం రోజు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గుడిసె పూర్తిగా కాలిపోవడం జరిగింది. బేడ బుడగ జంగాలకు సంబంధించిన జమ్ములమ్మ నిరుపేద కుటుంబం. జమ్ములమ్మ ప్రతిరోజు భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న జమ్ములమ్మకు 8 మంది సంతానం ఉన్నట్లు, ప్రస్తుతం ఆమెతో పాటు ముగ్గురు కూతుర్లతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. జమ్ములమ్మ ప్రతిరోజు మాదిరిగానే భిక్షాటన చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె నివాసం ఉంటున్న గుడిసె ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోవడం జరిగింది. గుడిసెలో ఉన్న వస్తువులతో సహా మొత్తం కాలిపోయి రోడ్డున పడడం జరిగింది. ఇట్టి సమాచరం బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తెలుసుకొని మానవతా దృక్పథంతో దాతలకు తెలపడంతో వారి సహాయ సహకారాలతో కాలిపోయిన గుడిసె స్థానంలో కొత్త గుడిసెను ఏర్పాటు చేసి నిత్య అవసర సరుకులు అందజేయడం జరిగింది. జమ్ములమ్మకు నూతన గుడిసె, నిత్యవసర సరుకులు సహాయం చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బేడ బుడగ జంగాల కు సంబంధించిన జమ్ములమ్మ మరియు విరి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ గతం నుంచి సమాజ సేవలో పాల్గొంటూ వస్తున్నానని దాతల సహాయ సహకారాలతో మానవతా దృక్పథా కోణంలో ఉన్న వాటికి అనేక కార్యక్రమాలు చేపట్టానని ముందు ముందు కూడా దాతల సహాయ సహకారాలతో సమాజ సేవలో ఉంటానని బీ ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తెలిపారు. గతం నుంచి ప్రస్తుతం వరకు సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
Kalam Power News