కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 23 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “అంకుల్..! ఆడుకోవడానికి బయటికొచ్చాం… కుక్కలు కరుస్తున్నాయి… మేమేం చేయాలి.?” అనే రోదనలు రొజు వినిపిస్తున్నాయి. “కాంక్రీట్ జంగిల్లో కమిషనర్ గారి నిద్ర గాధ!” ను చూస్తే.. మహబూబ్నగర్ పట్టణం క్రమంగా కాంక్రీట్ జంగల్గా మారుతుండగా, నగరంలో ‘వీధి కుక్కల స్వైర విహారం’ ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఆది వారం రాత్రి వేళ గోల్ మస్జిద్ ప్రాంతంలో జరిగిన ఘటనలో చిన్నపిల్లలు కుక్కల దాడికి గురవడంతో, పట్టణ భద్రతపై మరొకసారి ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. “పట్టణ అభివృద్ధి అంటే భవనాల పెరుగుదల మాత్రమేనా.? లేక ప్రజల భద్రత కూడా కుడా అందులో భాగమే కదా.? ” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొనగా, అధికార యంత్రాంగం మాత్రం మౌనం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “కాంక్రీట్ పెరిగింది… పన్నులు కొట్లలో వసూళ్లు చేస్తున్నారు.. కార్పోరేషన్ కు వచ్చే రాబడినే చూస్తున్నారు కాని చిన్నారుల కు మాత్రం భద్రత, రక్షణా కరువైంది.? “ఎందుకు వారికి ఓటు హక్కులేదనేనా..?” అనే సందేహం మహబూబ్నగర్ ప్రజల మనసుల్లో మిగిలిపోతోంది. మహబూబ్నగర్ పట్టణం రోజురోజుకు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న వేళ, ప్రజల భద్రత మాత్రం కాగితాలపైనే పరిమితమవుతోంది. గోల్ మస్జిద్ ప్రాంతంలో చిన్నపిల్లలపై కుక్కల దాడి ఘటన, అధికార యంత్రాంగం “చూసే చూపు – చేసే పని” మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేసింది. “చేతిలో కర్ర లేకపోతే కుక్క దూకుతుంది” అన్న సామెత ఇక్కడ సాక్షాత్కారం అవుతోంది. నియంత్రణ చర్యలు లేకపోతే సమస్యలు తలెత్తడం సహజం. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం “ముందు చూపు లేకపోతే వెనుక నష్టం తప్పదు” అనేలా మారింది. పట్టణంలో చెత్త పేరుకుపోవడం, వీధి కుక్కల పెరుగుదలకు కారణమవుతుంటే, శాశ్వత పరిష్కారం మాత్రం ఎప్పటికీ “ఫైళ్లలోనే” తిరుగుతోంది. “గాలి మాటలు గోడ దాటవు” అన్నట్టు, ప్రకటనలు, హామీలు ప్రజల దైనందిన జీవితాన్ని రక్షించలేకపోతున్నాయి. “పిల్లల భద్రత కంటే ఫైళ్ల భద్రతే ముఖ్యమా?” అంటూ ప్రజలు అడుగుతున్న ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు అధికారులు సమావేశాలు, సమీక్షలు అంటూ, "మద్యమద్యలో కాజు, బాదం, పిస్తాలు తింటూ కాలక్షేపం చేస్తుంటే..", మరో వైపు వీధుల్లో పిల్లలు భయంతో బిక్కు బిక్కు మంటూ అడుగులు వేస్తున్నారు. “ కుక్కలను చూసి జాగ్రత్త చర్యలు చెప్పడం కాదు… అది కాటు వేయక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ” అన్న సూత్రం ఇక్కడ పూర్తిగా విస్మరించబడింది. జిల్లా కలెక్టర్ స్థాయిలో సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే “పెద్దవాడు కదలితేనే చిన్నవాడు కదులుతాడు” అన్నది జగమెరిగిన సత్యం... పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోతే, కిందిస్థాయి అధికారుల్లో చలనం ఉండదు, చర్యలు కేవలం రూపకల్పనగానే మిగిలిపోతాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా.? లేక “పొయ్యిలో మంట ఉండగానే పొగ ఆర్పే ప్రయత్నం” చేస్తారా.? అన్నది కాలమే చెప్పాలి. మొత్తానికి, మహబూబ్నగర్ నగర కార్పొరేషన్ పరిధిలో పరిస్థితి ఒకే మాటలో చెప్పాలంటే ………………….. “కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” ఇప్పుడు నిర్ణయం అధికారులదే:....................... “కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతుంటే… చిన్నారులు ఇంట్లోనే బందీలు కావాలా.?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ నగరాన్ని ‘సురక్షిత నగరం’గా మార్చాలా… లేక ‘కుక్కల రాజ్యం’గానే వదిలేయాలా..? “కాంక్రీట్ జంగిల్లో కుక్కల రాజ్యం… కలెక్టర్ స్పందన ఎప్పుడూ.?” అంటూ పట్టణ భద్రతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల ఆవేదన అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్త గారు వెంటనే స్పందించి “వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం” చూపాలని కోరుతున్నారు. పట్టణంలోని ప్రతి డివిజన్లో ఉన్న వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర నుంచి మేల్కొని చర్యలు తీసుకుంటారా.? లేక సమస్యలు మరింత పెరిగిన తర్వాతే స్పందిస్తారా.? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠతో కూడిన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి...
Admin
Kalam Power News