కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 25 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్నగర్ బస్టాండ్ సమీపంలోని ₹5 భోజన కేంద్రం వద్ద టెంట్ ఏర్పాటు అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, పేదలకు కనీసం తినే చోట నీడ కూడా కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు. భోజనం కోసం వచ్చే బడుగు, బలహీన వర్గాల ప్రజలు మండుతున్న ఎండలో ఇబ్బందులు పడుతుంటే, వారికి నీడ కల్పించాల్సిన బాధ్యత ఉన్న నాయకులు టెంట్ విషయంలోనే రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ***___---“నీడకూ అడ్డంకులా?”---___*** “పేదలు తినే చోట కనీసం టెంట్ వేయడానికి కూడా అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్, ఇది ప్రజాసేవ కాదని, చిల్లర రాజకీయాలేనని తీవ్రంగా విమర్శించారు. ___---___“పేరు కోసం కాదు… సేవ కోసం పని చేయాలి”___---___ ఎవరు టెంట్ వేస్తే వారికి పేరు వస్తుందనే ఆలోచనతో అడ్డుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే ప్రధాన కర్తవ్యం కావాలని, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం కావాలని స్పష్టం చేశారు. :::: ప్రజల్లో ఆగ్రహం :::: ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఒక ప్లేటు అన్నం తినే చోట కూడా రాజకీయాలు చేస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి” అని వారు అంటున్నారు. “పేదల కోసం ఏర్పాటు చేసిన భోజన కేంద్రం వద్ద టెంట్ వేయడానికే ఇంత వివాదం అవసరమా?” అన్న ప్రశ్న ఇప్పుడు మహబూబ్నగర్లో వినిపిస్తోంది. “అన్నం ఇస్తే సరిపోదు… నీడ కూడా ఇవ్వాలి” అనే సందేశాన్ని ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది.
Admin
Kalam Power News