కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ రుణాలు బ్యాంకర్లు లబ్దిదారులకు సంబందించిన పలు సమస్యలను పరిష్కరించాలని శని వారం కలెక్టర్ సంతోష్ కు జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు బ్యాంకులు అందించిన ఖచ్చితమైన మార్గదర్శకాలు లేనందున లబ్ధిదారులకు పెద్దసమస్య గా మారిందన్నారు. ఉద్యమ్ సర్టిఫికెట్లు లబ్ధిదారులకు అందించినప్పటికీ బ్యాంకు అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. లబ్ధిదారులు ఎక్కువ ఉన్నందున శిక్షణ ట్రైనింగ్ సెంటర్లు పెంచాలని ,సెంటర్లు పెంచినట్లయితే శిక్షణ పొందేందుకు సులభంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న సెంటర్లలో హైజినిక్ సౌకర్యాలు నిర్వహించడం లేదని ,శిక్షణ కోసం ఉపయోగించే యంత్రాలు నాసిరకంగా ఉన్నాయని అన్నారు. ఈ పథకం కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నిధులతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావున సెంటర్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో లు పెట్టడం లేదన్నారు. శిక్షణ పూర్తీ అయినా తర్వాత ఎలాంటి ఎంక్వరి లేకుండా బ్యాంక్ అధికారులు లక్ష రూపాలయాలు ఇవ్వాలని కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్, బిజెపి సీనియర్ నాయకులు శ్యామ్ రావ్, డబ్బిలేటి నరసింహ ,మాన పాడు అధ్యక్షుడు మురళి క్రిష్ణ,నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News