కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో శుక్ర వారం ఆర్యవైశ్య ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మట్టి గణపతి విగ్రహాలు అందించడం జరిగింది. మట్టి గణపతి విగ్రహాల వితరణ: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మన వంతు బాధ్యతగా ఈ వినాయక చవితిని మట్టి గణపతి తో జరుపుకోవాలనే ఉద్దేశంతో కల్వకుర్తి పట్టణ ఆర్యవైశ్యులందరికి మట్టి గణపతులు అందించడం జరిగింది. వాసవి సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శివ్వ జగదీశ్వర్, కోశాధికారి నారాయణరాజు, గౌరవ ట్రస్ట్ సభ్యులు గౌరయ్య, గంధం ప్రసాద్, నీల లింగం, అవోప అధ్యక్షులు పాపిశెట్టి సతీష్ గుప్తా, వాసవి క్లబ్ అధ్యక్షులు చిదిరే శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థల సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
Admin
Kalam Power News