కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు తిరుగులేదని, క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవలకు రాష్ట్రపతి గుర్తింపు కూడా పొందడం గొప్ప విషయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ అన్నారు. శనివారం ఆయన కల్వకుర్తి క్లబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ లో నిర్మించిన సరస్వతి మాత ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. అనంతరం వాసవి క్లబ్ భవనంలో కల్వకుర్తి వాసవి క్లబ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయన్నారు. ఎన్నో సంస్థలు చేస్తున్న సేవలకు విభిన్నంగా సేవలందించడం తమకే చెందిందన్నారు. ఈ సంవత్సరం వాసవి క్లబ్ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రధానంగా విద్య వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం 20 మంది పేదలకు బియ్యం చీరలను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని రవిచంద్రన్ కోరారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తదుపరి క్లబ్ గవర్నర్ జగదీష్ వాసవి వనిత క్లబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా చిదిరె శ్రీనివాసులు శ్రీలక్ష్మి, కార్యదర్శులుగా కల్వ లక్ష్మి ఆంజనేయులు, కోశాధికారిగా దుగ్గి ధనలక్ష్మి అశోక్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కల్వ హరికృష్ణ, కలిమిచర్ల రమేష్, జూలూరి సత్యం, చిగుళ్లపల్లి శ్రీధర్, నీల లింగం, కొండూరు కృష్ణయ్య, యాద శోభన్ బాబు, శివ రాఘవేందర్, పిఎస్ఎన్ గుప్తా, నామ ఆనంద్ కుమార్, మురళి, పరమేష్, రామనాథం వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News