కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల పట్టణంలోని 24 వ వార్డు రామాలయం దేవాలయ సమీపంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు పొందడం జరిగినది. 24వ వార్డు మహిళలు ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి కి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. పూజ కార్యక్రమాల అనంతరం బతుకమ్మ సంబరాలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలకు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు మహిళలతో పాటు ఎస్ వియర్ రాజు యాదవ్, గుమ్మడం గోపాల్, ప్రీతం, శ్రీకాంత్ (లడ్డు), మోహన్ యాదవ్, పవన్ యాదవ్, రమేష్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News