కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : రంగుల కేలి హోలీ పండుగ సంబరాలు సోమవారం కల్వకుర్తి పట్టణంతోపాటు మండలంలో ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్, ఆవోప ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. డీజే ఆటపాటలతో నృత్యాలు చేశారు. రంగులతో నిండిపోయారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలూరు రమేష్ బాబు నాగర్కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి చిగుల్లపల్లి శ్రీధర్, పొలిటికల్ డిస్టిక్ చైర్మన్ వాస శేఖర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు చిదిరే శ్రీనివాస్, కోశాధికారి దుగ్గి అశోక్, అవోప అధ్యక్షుడు సతీష్ గుప్తా రైస్ మిల్లర్స్ సమన్వయకర్త కంది ప్రవీణ్ కొండూరు కృష్ణయ్య గందే రవి, జూలూరు సత్యనారాయణ, నీల లింగం, గోవింద శ్రీనివాస్, ప్రకాశ్, గోవింద్ క్రిష్ణయ్య తోపాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News