Friday, 16 January 2026 07:43:22 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ

Date : 22 September 2025 12:13 AM Views : 204

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల కార్యక్రమాలపై ముద్రించిన పుస్తకాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. తొలత అమ్మవారి కి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుండి ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన చెప్పారు. మొదటిరోజు అమ్మవారిని ధాన్య లక్ష్మీదేవి అలంకరణ లో అలంకరిస్తున్నామని వెల్లడించారు వేకువ జామున 5 గంటల నుండి ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాల తో అలంకరించడంతోపాటు పట్టణ ముఖ్య కూడలలో మైకులను ఏర్పాటు చేసి దేవాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను భక్తులకు, పట్టణ వాసులకు తెలిసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రతినిత్యం ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు జూలూరు రమేష్ బాబు చెప్పారు. అక్టోబర్ 2న దసరా పండుగ, 4న అమ్మవారి ఊరేగింపు అవబ్రృద స్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంధం ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాస శేఖర్, మాజీ ఎంపిటిసి కల్మిచర్ల గోపాల్, ఉత్సవ కమిటీ కార్యదర్శులు గుండ్ల రేవంత్, దాచేపల్లి నితిన్, కోశాధికారులు గిరిబాబు, తరుణ్, గంప వెంకటేష్, ముత్యాలు, కిషన్, ప్రవీణ్, అప్పయ్యపల్లి శీను, సామల నరసింహ, కృష్ణయ్య, శంకర్ తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :