Tuesday, 21 April 2026 05:48:20 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

భాగ్యలక్ష్మీ యం బి బి ఎస్ చదువుకు వైద్య విద్యార్థుల చేయూత..రూ 45 వేల ఆర్థిక సాయం అందజేత - అశ్విని నవదీప్ ను అభినందించిన ఎమ్మెల్యే యెన్నం

Date : 15 October 2024 07:38 AM Views : 1026

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థినీ భాగ్యలక్ష్మీ యం బి బి ఎస్ చదువుకు వైద్య విద్యార్థులు అండగా నిలిచారు. మహబూబ్ నగర్ సింహగిరికి చెందిన నిరుపేద నాయీ బ్రాహ్మణ కుటుంబమైన లావణ్య , వెంకటేశ్ దంపతుల కుమార్తె భాగ్య లక్ష్మీ నీట్ -2024లో ఉత్తమ ర్యాంక్ తో సిద్దిపేట లోని సురభి మెడికల్ కాలేజ్ లో యం బి బి ఎస్ సీటు సాధించింది. యం బి బి ఎస్ లో అడ్మిషన్ కు రూ.ఒక లక్షా 40 వేల రూపాయల అవసరం కాగా పూట గడవని తల్లి దండ్రులు అంత పెద్ద మొత్తంలో డబ్బు ను సమకూర్చే పరిస్థితి లేని విషయాన్ని తెలుసుకున్న పి ఆర్ టి యూ టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్ర శేఖర్ తనయుడు వైద్య విద్యార్థి మెడి సర్కిల్ ఫౌండర్ అశ్విని నవదీప్ తన సహచర వైద్య విద్యార్థుల సహకారంతో రూ 45వేల రూపాయల నగదును భాగ్యలక్ష్మీ కి అందజేశారు. అంతే కాకుండా భాగ్య లక్ష్మీ నాలుగేళ్ల యం బి బి ఎస్ కోర్సుకు అవసరమైన వైద్య పుస్తకాలను తెలుగు రాష్ట్రాలకు చెందిన మెడికల్ ఇన్ ప్లుయెన్సర్ల తరఫున అందజేస్తామని మెడి సర్కిల్ ఫౌండర్ అశ్విని నవదీప్ తెలిపారు. అదే విధంగా వైద్య విద్యా ప్లాట్ ఫారమ్ ల సబ్ స్క్రిప్షన్ లు, మెడికల్ కాన్ఫరెన్స్ , ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం సామాజిక బాధ్యత గా అందజేస్తామని తెలిపారు. ఈ విధంగా పేదింటి బిడ్డ యం బి బి ఎస్ చదువుకు వైద్య విద్యార్థులు చేయుతనివ్వడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. *అశ్విని నవదీప్ ను అభినందించిన ఎమ్మెల్యే యెన్నం* భాగ్య లక్ష్మీ యం బి బి ఎస్ చదువుకు చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చిన వైద్య విద్యార్థులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. భాగ్య లక్ష్మీ ఆర్థిక కష్టాలను గుర్తించి సహచర వైద్య విద్యార్థుల సహకారం తో రూ: 45 వేల రూపాయల నగదు ను సమకూర్చి అంద జేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వైద్య విద్యార్థి , మెడి సర్కిల్ ఫౌండర్ అశ్విని నవదీప్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి అభినందించారు. హన్మకొండ లోని యం బి బి ఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అశ్విని నవదీప్ తన వైద్య విద్యను అభ్యసిస్తున్న మిత్రులతో కలసి పేదింటి బిడ్డ కు చేయూత నివ్వడం అభినంద నీయమని ఎమ్మెల్యే అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సామాజిక స్ఫూర్తి కలిగిన అశ్విని నవ దీప్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు, వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ రమణయ్య, మేనేజర్ నర సింహా నవదీప్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :