కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గత తొమ్మిది రోజులుగా కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మంగళవారం శ్రీ దుర్గా దేవి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ అభిషేకాలు దంపతలచే కుంకుమార్చన, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, చండీ మహా హోమం నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి లు తెలిపారు. ఆనతరం పెద్ద మంగళ హారతి దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం కోలాటాలు దాండియా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సలహాదారు వాస శేఖర్, కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, డి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు, సంబ తరుణ్ లు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు, మహిళలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News