కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పవిత్రమైన శుక్రవారం రోజు లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం ప్రవచనకర్త జూలూరి స్వరూప రాణి నేతృత్వంలో గోపూజ వాసవి మాత పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు గోవులకు పూజ చేశారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ గోవులకు పూజ చేయడం ఎంతో మేలు చేస్తుంది అన్నారు అనంతరం వాసవి పారాయణం నిర్వహించారు రాష్ట్రంలోని 102 వాసవి మాత దేవాలయాలలో వాసవి మాత పారాయణం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కల్వకుర్తిలో 93వ ఆలయం అని స్వరూప రాణి చెప్పారు పారాయణం అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, జూలూరు ప్రకాష్ , నరసింహులు గుప్తా, సంపత్ కుమార్ మహిళలు భక్తులు పాల్గొన్నారు
Admin
Kalam Power News