Tuesday, 21 April 2026 05:41:32 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

ఎంపీటీసీ / జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి : జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతుల నిర్వహణ

Date : 11 February 2025 02:49 PM Views : 1366

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : రాబోవు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులను నిర్వర్తించనున్న రిటర్నింగ్ అధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ట్రైనర్ లతో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి, వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగనున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ జారీ నుండి నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు,పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు అత్యంత జాగ్రత్తగా, పూర్తిస్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థికి పూర్తి అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన తక్షణమే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాలని, అభ్యర్థులు ఎన్ని నామినేషన్లు సమర్పించినా వాటిని పూర్తిగా పరిశీలించి, ఆమోదించినవి, తిరస్కరించినవి, తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి అతడితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తి కలిపి గరిష్టంగా ముగ్గురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలో ప్రవేశం కల్పించాలన్నారు. అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనని ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని, ప్రతి అంశాన్ని అధికారికంగా పూర్తిగా పరిశీలించిన తరువాతే ఉపసంహరణకు అనుమతించాలని ఆదేశించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఎన్నికలు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి, పోలింగ్, కౌంటింగ్ సమయంలో సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి క్రమబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మి నారాయణ, నర్సిగ్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :