కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకుని ఉన్న బీసీ నేతలను పార్టీ కోసం పని చేస్తే పట్టించుకోవడంలేదని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేస్తూ కష్టనష్టాలను అనుభవిస్తూ పార్టీలోనే కొనసాగుతూ ఉంటే.. బీ ఆర్ ఎస్ పార్టి లో ఉన్న నాయకులు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన పార్టీ కి చెందిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తన అక్రమ వ్యాపారాలను కొనసాగించేందుకు అధికారం కోల్పోయిన పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలొకి వస్తె మళ్లీ పార్టీనీ అడ్డం పెట్టుకొని పనులు చక్కబెట్టుకునెందుకు పార్టీ మారి న వ్యక్తులకే డికే అరుణ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ నాయకుల మైన మమ్మల్ని అగౌర పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పార్టీ మనుగడ దెబ్బ తింటుందని ఆయన ఆరోపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వై వైరల్ కావడంతో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ గౌడ్ గురు వారం ఇంటికి వెళ్లి అతనిని కలిశారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మద్దతుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేతలను పార్టీలు పట్టించుకుని సరైన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. బడుగు బలహీన వర్గాల వారు పార్టీలు జెండాలు మోయడానికి ఫ్లెక్సీలు కట్టడానికి గుర్తుకొస్తారు. కానీ పదవులు ఇవ్వడానికే వెనకంజ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు బడుగు బలహీన వారు. బడుగు బలహీన వర్గాలకు వారి ఎదుగుదలకు ప్రోత్సహించాలని సూచించారు. ఫోటో : ముచ్చర్ల జనార్దన్ రెడ్డికి సంబంధించిన అక్రమ వెంచర్ వివరాల పత్రాలను చూపిస్తున్న నిరంజన్ గౌడ్
Admin
Kalam Power News