కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చేనేత జ్యువలరీ శాఖ సహాయ సంచాయి లోపల వారి కార్యాలయానికి విచ్చేసిన రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ ను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ చేనేత కార్మికుల సమక్షమున సన్మానించి జోగులాంబ గద్వాల జిల్లా చేనేత కార్మికుల సమస్యల పైన చర్చించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చేనేత కార్మికుల త్రిఫ్ట్ ఫండ్ అమౌంట్ను త్వరగా కార్మికులకు అందించాలని కోరడం జరిగింది. అదేవిధంగా గతంలో చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇల్లు పథకంలో చేనేత కార్మికులకు ప్రత్యేక హోదా కేటాయించాలని కోరడం జరిగింది ఇందుకు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత కార్మికుల యొక్క సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్మికులకు అందరికీ అందుబాటులో ఉండి కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చేనేత సహాయ సంచాలకులు గోవిందయ్య ఏ డి వో లు రాజేశ్వర్ రెడ్డి ప్రియాంక రాజోలి చేనేత కార్మిక సంఘం కార్యదర్శి దర్జీ వీరేష్ వీరన్న తదితర కార్మికులు పాల్గొనడం జరిగింది.
Admin
Kalam Power News