కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో ఈరోజు ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. బుధ వారం ప్రత్యేకత సామూహిక వడి బియ్యం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వడి బియ్యం పోయడం జరిగింది. అదే విధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆయనతోపాటు బాలాజీ సింగ్ ఆనంద్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ మరియు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, వారితోపాటు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎడ్మా సత్యం , వెంకటేశ్వర స్వామి దేవస్థానం కల్వకుర్తి చైర్మన్ కల్వ మనోహర్ తదితరులు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారిని ఉత్సవ కమిటీ సభ్యులచే సన్మానించడం జరిగింది. అనంతరం మహా మంగళహారతి తీర్థప్రసాద వితరణ మరియు విచ్చేసిన భక్తులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్, అవోప మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News