Friday, 16 January 2026 09:19:38 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం: జిల్లా ఎస్పీ డి.జానకి

Date : 20 October 2024 07:34 PM Views : 907

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుదామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. 21.10.2024 నుండి 31.10.2024 వరకు పోలీస్ అమరవీరుల స్మరించుకుంటూ *పోలీస్ ఫ్లాగ్ డే* ను నిర్వహిస్తున్నట్లుగా ఎస్పి ప్రకటించారు. ఈ పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని తోలిరోజైన సోమ వారం పోలీస్ కవాతు మైదానము నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించబడుతుందని, ఈ సందర్భంగా సోమ వారం ఉదయం 7 గంటలకు జిల్లా పోలీసు కవాతు మైదానము నందు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద వివిధ సంఘటనల్లో నక్సలైట్ల చేతుల్లో అమరులైన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు *శోక్ శ్రస్త్* పరేడ్ నిర్వహించబడుతందని, ఈ కార్యక్రమములో జోగులాంబ జోన్ డిఐజి ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా మరియు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత అధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు హజరయి అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో హజరయి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు రావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :