కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో దేవి దివ్య శరణావరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసినవి. ఈరోజు ఉదయం ప్రాతః కాల పూజలు మొదలుకొని అమ్మవారు ముందు కుంభం పోయడం, ఖడ్గాలు వేయడం జరిగింది. *లడ్డూ వేలం:* తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు 71,116/- దాచేపల్లి నరసింహా స్వామి వేలం పాటలో కైవసం చేసుకోవడం జరిగింది. *చీరల వేలం:* అమ్మవారికి తొమ్మిది రోజులు అలంకరించిన చీరలను వేలం వేయడం జరిగింది వాసవి మాత మరియు సరస్వతి మాత చీరలు భక్తులు వేలం పాటలో కైవసం చేసుకోవడం జరిగింది. చీరల మొత్తం విలువ 16,65,336/- రూపాయలు. అత్యధికంగా దుర్గామాత చీర ₹1,70,116/- రూపాయలకు వాస రవికుమార్ గారు కైవసం చేసుకోవడం జరిగింది. *అమ్మవారి శోభాయాత్ర:* శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా అమ్మవారిని కల్వకుర్తి పురవీధుల గుండా మేళ తాళాలతో, కోలాటాలు, దాండియా నృత్యాలచే అత్యంత శోభాయమానంగా, కన్నుల పండుగగా శోభాయాత్ర కొనసాగడం జరిగింది. *అవబృద స్నానము:* సాయంత్రం 7 గంటలకు సింహాద్రి డికార్డిగేటర్స్ నందు అవబృధస్నానం ఏర్పాటుచేయడం జరిగింది. అనంతరం ఉత్సవ కమిటీ కార్యవర్గానికి మరియు దాతలకు సన్మానం చేయడం జరిగింది. *దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో* నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ , ప్రధాన కార్యదర్శి కల్మిచర్ల రమేష్, అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కల్వకుర్తి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండూరు గోవర్ధన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం , అవోప, వాసవి క్లబ్ మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News