కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో సోమ వారం అమ్మవారు లలితా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు, దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె., పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవతో మొదలై అభిషేకం, ప్రత్యేక అలంకరణ మరియు రెండు పర్యాయాలు దంపతులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. గీతా ప్రచార సమితి వారిచే భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామాలు పఠించడం జరిగింది. పట్టణ ఆర్యవైశ్య మహాసభ వారిచే వృద్ద దంపతులకు సన్మానించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆశ్రమం నుండి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ పరమాత్మనందగిరి స్వామీజీ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం వారి అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. వారిని ఉత్సవ కమిటీ సభ్యులచే సన్మానించడం జరిగింది. అనంతరం మహా మంగళహారతి తీర్థప్రసాద వితరణ మరియు విచ్చేసిన భక్తులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్, అవోప మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News