కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు లలితా దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది.. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ రెవెన్యూ మరియు సమాచార ప్రజాబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారికి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం రమేష్ బాబు మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మరియు MLA కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ , కలిమిచర్ల రమేష్ , శివ్వ జగదీశ్వర్ , చిగుళ్ళ పల్లి శ్రీధర్ ,సురేష్ ,ఉప్పు అంజనేయులు హాజరయ్యారు. ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్షులు నారాయణ రాజు, దాచేపల్లి నితిన్, కోశాదికారులు పానుగంటి వెంకటేష్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్ , గంధం ప్రసాద్ , జూలూరి వీరేష్ , కంది ప్రవీన్ , దుగ్గి వెంకటేష్ , గార్లపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News