కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : అమిస్తాపూర్ గ్రామానికి చెందిన శీను, యాదమ్మ అవసరం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోట చంద్రశేఖర్ జువెలరీ షాప్ లో తాకట్టుపెట్టి అవసర నిమిత్తం ఆ డబ్బును తిరిగి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో డబ్బును పోగొట్టుకున్నారు. దారిన చుసిన అ డబ్బును క్యూన్యూస్ రిపోర్టర్ కాడం రాఘవేందర్, జనవాహిణి రిపోర్టర్ కృష్ణ 30,000రూపాయల ను వెంటనే వన్ టౌన్ ఎస్సై కి అప్పజెప్పి వివరాలు తెలుసుకోని బాధితులకు అప్పజెప్పారు. పోగొట్టుకున్న 30,000 వేల రూపాయలను తిరిగి ఎస్ఐ శీనయ్య ఆధ్వర్యంలో వారికి అందజేయబడ్డాయి. నిజాయితీతో డబ్బును అందజేసినందుకు మహబూబ్ నగర్ రిపోర్టర్లను అభినందించారు.
Admin
Kalam Power News