Friday, 16 January 2026 07:42:22 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం

Date : 23 September 2025 06:33 PM Views : 193

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మంగళం రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మ వారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతం, అభిషేకాలు,వేద పారాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, భక్తుల చే పల్లకి సేవ,దంపతలచే సామూహిక కుంకుమార్చన, దేవతలకు నైవేద్యం సమర్పించడం,పెద్ద మంగళహారతి, ఆనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల దాతల సహకారంతో ఘనంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, సాంసృతిక కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఎస్పీ ఆర్ స్కూల్ విద్యార్థులచే అష్టలక్ష్మీ, లలిత సహస్రనామ పారాయణం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండల రేవంత్,డి నితిన్, కోశాధికారి లు సంబు తరుణ్, పోల గిరిబాబు, ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. సాయంత్రం నాదస్వర విన్యాసం, కోలాటాలు, దాండియా తోపాటు మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ కార్యక్రమాలు ఉంటాయి అని దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి కమిటీ సభ్యులు తెలిపారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :