కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టి ఎస్.సి.పి.ఎస్.ఈ.యు సంఘం ఆధ్వర్యంలో సిపీ ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎ ఐ సీసీ కార్యదర్శి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యెక ఆహ్వానితులు, మాజీ ఎమ్మెల్యే డా. చల్లా వంశీ చంద్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టో లో ఉంచి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ సందర్బంగా ప్రస్తుతం అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించి, రెండు లక్షల సిపి ఎస్ ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.పి.ఎస్.ఈ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహారావు, జిల్లా అసోసియేట్ సభ్యులు సైదులు, వంగూర్ మండల అధ్యక్షుడు రాజేందర్, వెలదండ మండల అధ్యక్షుడు పర్వతాలు, వేణు, వెంకట్, రమేష్, శ్రీనివాసరెడ్డి, మురళి, మల్లేష్, ఫిరోజ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News