కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : మండలంలోని గ్రామాల్లో నెలకొన్న త్రాగునీరు, విద్యుత్, పశు వైద్యం, విద్యా ఉపాధి, అంశాలపై మండల సర్వసభ్య సమావేశంలో వాడి వేడిగా సభ్యుల ప్రశ్నలతో కొనసాగింది బుధవారం రైతు వేదికలో ఎంపీపీ గుపాని కళావతి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి జడ్పిటిసి సభ్యుడు ఇంద్రయ్య సాగర్ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి తాసిల్దార్ బ్రహ్మం గౌడ్ ఎంపీడీవో స్వరూప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా గ్రామానికి చెందిన సదరు కాంట్రాక్టర్ కు పనులను కట్టబెట్టడం ఏమిటని ఎంపిటిసి సభ్యుడు యాట సత్యనారాయణ సభా దృష్టికి తీసుకెళ్లారు. గొర్రెల పంపిణీ కోసం గత ప్రభుత్వం హాయంలో లబ్ధిదారుల నుంచి డీడీలు కట్టించుకున్న నేటి వరకు గొర్రెల పంపిణీ కాలేదని కొమ్మిరెడ్డి పల్లి సర్పంచ్ సాయి రెడ్డి వైద్య అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వ నిర్ణయ ప్రకారం తగు చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. విద్యుత్ బిల్లుల మాఫీ కోసం ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన నేటి వరకు ఎలాంటి మాఫీలు కాలేదని ప్రస్తుతం బిల్లులు కట్టాలా వద్దా అనే అయోమయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జెడ్పిటిసి సభ్యుడు ఇంద్రయ్య సాగర్ విద్యుత్ శాఖ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి చర్య తీసుకుంటామని ప్రజలకు ఇబ్బందులు కలగనివ్వమని విద్యుత్ అధికారులు భరోసా తెలిపారు. పెంచిన పింఛన్లు రైతుబంధులను సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.
Admin
Kalam Power News