Friday, 16 January 2026 07:50:35 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాకు ఏంటి.! అధికారులు అండగా ఉంటే చాలు..!! మట్టిని కడిగి ఇసుకగా మార్చి..! రూరల్ మండల పరిధిలో యధేచ్ఛగా కొనసాగుతన్న తతంగం.!

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాకు ఏంటి..! అధికారులు అండగా ఉంటే చాలు...!!

Date : 26 December 2023 06:03 PM Views : 1701

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఏమి.. అధికారులు మాకు అండగా ఉండగా మా దందాలు యధేచ్ఛగా కొన సాగిస్తామంటూ.. మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. పంట పొలాల్లోని మట్టిని జేసిబి యంత్రాలతో త్రవ్వి ట్రాక్టర్లలో నింపి బోరు మోటార్ల ద్వారా ఆ మట్టిని కడిగి ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు. ఈతతంగమంతా రాత్రి పగలు అని తేడా లేకుండా యదేచ్చగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉన్నత అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక మాముల్ల పర్వం కొనసాగుతుండడంతో ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా రెవెన్యూ పోలీస్ సిబ్బంది ముందుకు రావడం లేదనేది ప్రధాన ఆరోపణ. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామ శివారు నుంచి వెంకటేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనే రైతులు తమ పంట పొలంలో రాత్రి పగలు అని తేడా లేకుండా మట్టిని కడిగి ఇసుకను చేస్తూ అధికారుల అండదండలతో యధేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగిస్తున్నారని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు ఈ ఇసుకను వాడినా నాణ్యత లేని కట్టడాలు తయారవుతాయని చేసేది లేక కొంతమంది కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ వంటి నిర్మాణాలకు ఈ ఫిల్టర్ ఇసుకను ఉపయోగిస్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రంలో రెవిన్యూ పోలీసు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ పక్కనే ఇంత తతంగం నడుస్తున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరి కదా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాఫియాకు అడుగులకు మడుగులోత్తిన విధంగా కాకుండా ఫిల్టర్ ఇసుక మాఫియా పై కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా గట్టి చర్యలు తీసుకొని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. https://youtu.be/RbaZFg16xUw?si=nnhQ3zA0TQkmHykz

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :