కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : అవినీతి రహిత పాలన కోసం పత్రికలు తమ వంతు కృషి చేయాలని భూకబ్జాలు ఇసుక మాఫియా అవినీతి రహిత పాలన కోసం పత్రికల్లో కథనాలు వెలువడితే వాటిని ఆసరాగా చేసుకొని అవినీతి రహిత పాలన చేసేందుకు ముందుకు కొనసాగుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెటిల్మెంట్లకు, భూ కబ్జాలకు వత్తాసు పలకనని ఎంతటి వారినైనా శిక్షించేందుకు అధికారులకు పూర్తి అధికారాలు ఉంటాయని తన పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే శిక్షలు తప్పవని కొత్తగా పార్టీలోకి ఎవర్ని ఆహ్వానించేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలా పదవులను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తానంటే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇసుక మాఫియా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని ఇప్పటికే మైనింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అవినీతిని పూర్తిగా బయటికి తీస్తానని అంతేకాకుండా పందులను పట్టుకుని వాటిని ఎం చేశారు ఇందులో ఎవరి ప్రమేయం ఉందో వారిపై తప్పకుండా చర్యలు చేపడతానన్నారు.
Admin
Kalam Power News