కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మిల్లర్లు మాయాజాలం చూపిస్తున్నారు.. కల్వకుర్తి నియోజకవర్గంలో కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన సి ఎం ఆర్ ను సివిల్ సప్లయ్ కి తిరిగి చెల్లించకుండా కాసుల కక్కుర్తితో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బియ్యం మాఫియాకు కేంద్ర బిందువుగా పేరుగాంచిన కల్వకుర్తిలో మిల్లర్లు గత కొంతకాలంగా కొత్త కుంభకోణానికి తెరలేపారు. వడ్ల ధరలు అధికంగా పెరగడంతో కస్టమ్ మిల్లింగ్ కింద తమకు కేటాయించిన వడ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర వ్యాపారాలు చేసి అప్పుల్లో కురుకుపోయిన వారు సైతం లాభసాటి గా మారిన రైస్ మిల్ బిజినెస్ ను ఎంచుకుని ముత పడ్డ మిల్లులను సైతం లిజుకి తీసుకోవడం తో పాటు 2022-2023 సంవత్సర కాలంలో కల్వకుర్తి చుట్టుపక్కల ప్రాంతాలలో కొత్తగా పలు రైస్ మిల్లుల నిర్మాణాలు చేపట్టారు. అందినకాడికి తిందామని యోచనలో వున్న అధికారుల చేతివాటంతో మిల్లుల నిర్మాణం పూర్తి కాకముందే విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వక ముందే మన నాగర్ కర్నూల్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు పెద్ద మనసు చేసుకొని పలు మిల్లులకు వరి ధాన్యాన్ని కేటాయించారు. అందులో భాగంగానే సంజాపూర్ దగ్గర ఓ మిల్లు రోడ్డ్ వైన్డింగ్ లో పోతుండగా.. ప్రభుత్వం తరపున ఆ మిల్లు యజమానుల కు భారీగానే నష్టపరిహారము అందుకొన్నారు. అంతటితో దన ధాహం తీరని దళారులు సిఎంఆర్ కింద ఇచ్చిన ప్యాడిని అమ్మేసుకున్నారు. ప్రభుత్వానికి పంపాల్సిన బియ్యాన్ని మాత్రం పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ మిల్లుకు రైతులు తెచ్చే వడ్లను మాత్రం బియ్యంగా మారుస్తూ వారి పనులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి సీఎంఆర్ చెల్లించకుండా మిల్లర్లు మీన వేషాలు వేస్తూ జాప్యం చేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తూనే ఉండిపోతున్నారు. పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లర్లు సీఎంఆర్ కింద వడ్లు తీసుకోని మొత్తం ఇతర రాష్ట్రాలకు తరలిస్తు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ కొత్త కుంభకోణానికి తెరలెపారు. ఇదే లాభదాయకమని ఒక్కో వ్యాపారస్తుడు రెండు, మూడు, స్వంతంగా నాలుగు మిల్లుల వరకు నిర్మాణలు చేపడుతూ ప్రభుత్వం నుండి ప్యాడి ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా పని చేస్తున్నారని కొందరు పిర్యాదు నిమిత్తం ఫోన్ చేస్తే ఏత్తకుండా తప్పించుకుంటున్నారు అని పిర్యాదు దారులు పేర్కొనడం గమనార్హం. -ప్రభుత్వానికి పంపని.. సిఎంఆర్ మిల్లులో నిల్వలు ఉన్నాయా..? లేవా..!! సీఎంఆర్ చెల్లింపులలో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతున్నప్పటికీ అధికారులు కనీసం ఒక్క మిల్లునైనా తనిఖీ చేసిన పాపాన పోలేదని సీఎం ఆర్ కోసం ఇచ్చిన వడ్లు మిల్లులలో, గోదాములలో ఉన్నాయా..? లేవా..? అనే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు శృతిమించి పోతున్నారు. ప్రభుత్వానికి సకాలంలో చెల్లించకుండా తమ దగ్గర ఉన్న వడ్లను అమ్ముకొని లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వున్న నేపద్యంలో ఇప్పటికైనా సివిల్ సప్లై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ సి ఎం ఆర్ సప్లయ్ విషయంలొ దృష్టి సారించి మిల్లర్ల పై కఠినంగా వ్యవహరించి సివిల్ సప్లై లో జరిగే కోట్ల రూపాయల కుంభకోణాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Admin
Kalam Power News