కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6గ్యారంటీలో ఒకటైన మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం శనివారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సుల వద్ద మహిళలలకు ఈ పథకంపై అవగాహన కల్పించాలనీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న విధానాన్ని ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ గ్రామాన ఉన్న మహిళా సంఘం సభ్యులందరికీ గ్రామంలోని మహిళలందరికీ విద్యార్థులందరికీ ఈ పథకం అమలు విధానాన్ని బాధ్యతగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు మహిళలు యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Kalam Power News