కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఆది వారం జిల్లెల్ల గ్రామంలో 4వ తేదీన నిర్వహించే ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లెల్ల మాజీ సర్పంచ్ గుమ్మకొండ రాములు ప్రజలకు దరఖాస్తు ప్రతులను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. దీని ద్వారా నిజమైన లబ్ధిదారులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొమ్మ గోని రవి గౌడ్, తాడం మౌనిక మల్లయ్య,కో ఆప్షన్ నెంబర్ గుమ్మకొండ బాల్ జంగయ్య లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏముక రవి, మహేందర్,పెరుమాల శ్రీశైలం, బాల్ రాజ్, శ్యాం, సాయి, గణేష్, మహేష్, శ్రీహరి, రమేష్, మహేష్, జంగయ్య రాజు, ప్రభాకర్, శ్రీశైలం, పరమేష్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News