కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కుక్క తోకే..గెలిచింది..! ఉద్యోగులతో పెట్టుకుంటే అంతే.. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగుల దెబ్బ ఎల ఉంటుందో తొలి సారి చంద్రబాబు చవి చూశారు. ఆ దెబ్బకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాకుండా పోయాడు. రానురాను అసలు తెలంగాణలోనే పార్టీ కనుమరుగైపోయింది. ఆయన వారసత్వాన్ని అందుకున్న శిష్యుడు కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను కుక్క తోక తో పోల్చడం, వారికి ఓట్లు లేవు, వున్నా అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని భావించడం వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పొందకుండా ఉద్దేశపూర్వకంగానే చేయడంతో ఆ అసంతృప్తి తారస్థాయికి చేరింది. ఇదంతా గమనిస్తూ ఉన్న ఉద్యోగ వర్గం సరైన సమయంలో సరైన సమాధానం చెప్పింది. ఈసారి అత్యంత భారీగా 2.20 లక్షల మంది ఉద్యోగ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టిన, గందరగోళ పరిస్థితులు సృష్టించిన తమ ఓటుని శోధించి, సాధించి మరి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈరోజు ప్రభుత్వాన్ని పాతి పెట్టడంలో ఎక్కువ భాగం ఉద్యోగుల శక్తి పని చేసిందనేది వాస్తవం. ఇక పార్టీ విషయానికొస్తే చంద్రబాబుకు తెలంగాణలో ఎటువంటి గతి పట్టిందో ఉద్యోగులతో పెట్టుకుంటే అదే గతి టి/బీఆర్ఎస్ కు పడుతుంది. అసలు అది ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి ఈ దెబ్బతోటి మరో రెండు దశాబ్దాలు కనుమరుగైపోవడం ఖాయం. ఈ అనుభవాలు వచ్చే ప్రభుత్వాలు కి ఒక హెచ్చరిక అనే విషయాన్ని ఏ పార్టీ అయినా గుర్తించుకోవాలి. కుక్క తోక జలుక్.. ఇస్తే కుక్క పరిస్థితి .. కుక్క సావే. అనేది ఉద్యోగులతో పెట్టుకుంటే తెలుస్తుంది..!! కర్ణాటక ఎన్నికలలో ఇదే జరిగిందా..! కేవలం 5 శాతం ఓటు షేర్ పెంచుకొని 56 సీట్స్ నెగ్గిన కాంగ్రెస్ 2 వేల ఓట్ల తేడాతో బీజేపీ కోల్పోయిన సీట్లు - 58 వెయ్యి ఓట్ల తేడాతో కోల్పోయినవి - 41 ఉద్యోగులకు ప్రభుత్వాలను దింపేసే శక్తి లేదు. అనుకున్నారు, కర్ణాటకలో ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కేవలం ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో చాలామంది ఓడిపోయారు. ఉద్యోగులు సంఘటితంగా ఉంటే ఏదైనా సాధ్యమే...
Admin
Kalam Power News