కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టాన మొగ్గు చూపింది. రాహుల్ గాంధీ సూచనతో ఏఐసీసీ ఆమోదం తెలిపింది.సోమవారంగచ్చిబౌలి లోని ఓ ప్రవేట్ హోటల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే తదితరుల సమావేశమైన సంగతి తెలిసిందే. వారంతా కూడా రేవంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూచించారు. తర్వాత జరిగిన పరిణామాలతో డీకే ఢిల్లీకి వెళ్లి సమస్యను వారి అధిష్టానం కోర్టులో వేశారు. దీంతో జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కను వేర్వేరుగా ఢిల్లీకి పిలిపించుకుని వారిని సముదాయించినట్లు తెలుస్తోంది. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, పార్టీ పటిష్టతకు, ఏర్పడే ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖను అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం సాయంత్రం లోపు అధికారికంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనేక ధపాలుగా జరిగిన చర్చల అనంతరం తెలంగాణ సీఎం ను ఖరారు చేశారు. ఈ నెల 7 వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సీఎం ఎంపిక అంశంలో ఆదివారం నుంచి ఉత్కంఠ కొనసాగింది. మొదటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ సీఎం అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో ఉండింది. పార్టీలోని సీనియర్ నాయకులైన ఉత్తమ్, కొమటిరెడ్డి, భట్టి విక్రమార్క సీఎం పదవిని ఆశించడంతో ఆలస్యమైంది.
Admin
Kalam Power News