కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కులవృత్తుల వారికి, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండేందుకు మద్యం దుకాణాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మద్యం దుకాణాల కేటాయింపులో తాము రిజర్వేషన్లను అమలు చేశామని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాఘవేందర్ గౌడ్ అనే వ్యక్తికి రిజర్వేషన్ ద్వారా లభించిన షాపును మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు తీసుకువచ్చిన ఉత్తర్వుల ఫలాలు ఆయా వర్గాలకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో కులవృత్తుల వారైనా గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు. రిజర్వేషన్ల ద్వారా ఆయా వర్గాలకు అండగా ఉంటున్నామని తెలిపారు.
Also Read : కులవృత్తుల వారికి రిజర్వేషన్ ఫలాలు రిజర్వేషన్ ద్వారా దక్కిన వైన్ షాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Admin
Kalam Power News