కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ఎం ఐ ఎం పార్టీ క్యాంప్ ఆఫీస్ జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో మంగళ వారం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ చేతుల మీదుగా ఉర్దూ మీడియం విద్యార్థినులకు మోడల్ పేపర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎంఐఎం పార్టీ క్యాంపు కార్యాలయంకు విచ్చేసిన ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ . మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ కోఆర్డినేటర్ జాబిర్ బెన్ సయ్యద్ ఆల్ జాబ్రి లకు గజమాలల తో జిల్లా అధ్యక్షులు మున్న భాష ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉర్దూ మీడియం విద్యార్థినులకు ,టెస్ట్ మోడల్ పేపర్లు, అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ల నుంచి నిరంతరాయంగా ఎం ఐ ఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ కొనసాగిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని చైతన్య పరిచి ముందుకు తీసుకుపోయే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామనీ ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలలో అంకిత భావంతో కార్యకర్తలు పని చేసి ఎక్కువగా కౌన్సిలర్లని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమాముద్దీన్. ఎండీ రఫీ. మహమ్మద్ కలీముల్లా. గోల్డెన్ షఫీ. చాగాపురం నజీర్. షఫీ. అస్లాం. అంజద్. మొహమ్మద్ ముస్తఫా. చాంద్ పాషా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్. శివ శాంతినగర్ టౌన్ ప్రెసిడెంట్. నదీమ్ యూత్ టీం. ఫరూక్ సయ్యద్ పాషా. తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Kalam Power News