కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నరు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు, ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో భట్టి విక్రమార్క కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి శేషవస్త్రం తో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను, 2024 టీటీడీ డైరీ, క్యాలండర్ ను అందజేశారు. తరువాత ఆలయం వెలుపల భట్టి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని , రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అధ్భుతమైన తీర్పును ఇచ్చారని ,తాను నిర్వర్తించే ఆర్థిక శాఖలో ఆర్థిక వనరులు అభివృద్ది చెందేలా కృషి చేస్తానని, పార్టీ పరంగా ఆరు గ్యారింటిలను నేరవేస్తామని భట్టి మీడియాతో అన్నారు.
Reporter
Kalam Power News