కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో చుట్టుముట్టు గ్రామాల చెరువు నుండి అక్రమంగా నల్లమట్టిని, పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సహజ వనరులను కొల్లగొట్టారని బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో పనులు చేపట్టకుండా నిర్మాణాలు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలను కల్లబొల్లి మాటలతో మోసాగించారని ఆరోపించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి కొత్తగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రబ్ధిదారులకు లక్ష 116 లతో పాటు తులం బంగారం ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ బగ్గీ కృష్ణయ్య, మాజీ జెడ్పిటిసి రామన్ గౌడ్, బాల నరసింహులు, సిజి గోవర్ధన్, ఉప సర్పంచ్ తాజుద్దిన్, ఎస్.కె పాషా, సలాం, ఖాదర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News