కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : రక్తదానం మహాదానమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో లైన్స్ క్లబ్ కల్వకుర్తి - కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ శిబిరంలో 117 మంది రక్తదానం చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జన్మదిన సందర్భంగా లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరం అన్నారు. రక్తదానంతో ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. సామాజిక సేవలో లయన్స్ క్లబ్ లో పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. సామాజిక సేవలో కల్వకుర్తి లైన్స్ క్లబ్ ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరు గొప్పవారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చురామకృష్ణ, లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కల్మిచర్ల రమేష్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బావన్డ్ల వెంకటేష్, క్లబ్ కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి గోవింద్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మిరియాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, సభ్యులు శ్రీనివాస్, రాఘవేందర్ థర్నికల్ శ్రీనివాస్, కొండూరు కృష్ణ, గోవింద కృష్ణయ్య, గుబ్బ కిషన్, తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు.
Admin
Kalam Power News