కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : విషసర్పం బారిన పడిన పాలమూరు ప్రజలకు విముక్తి లభించింది. ఎక్కడ నలుగురు కలిసినా ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆరాచక పాలన, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాలవారు చురుగ్గా పనిచేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పారదర్శక పాలన అందిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలుచేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి నుంచి స్వేచ్చాయుత వాతావరణంలో జీవించవచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ టీఎన్టీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, జిల్లా మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలీ, రాములుయాదవ్, బండ సునీల్, బాలస్వామి, ఫహిం తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News