కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : పట్టణంలోని ఎస్ జే ఆర్ ఫంక్షనల్ హాల్ లొ సోమ వారం జడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి ఆధ్వర్యం లో నిర్వహించిన జిల్లా సర్వ సభ్య సమావేశం లో ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశి క్రిష్ణ మాట్లాడుతూ ఒక్కో రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రగతిని సాధిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్, సంబంధిత సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా డాక్టర్, ఇంకా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు అధికారులను కోరారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుబంధు'కు సంబంధించి కొందరు రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో పడడం లేదని, సమస్య ఎక్కడ ఉందో పరిష్కరించాలని సభ్యులు కోరారు. రైతుబంధుకు సంబంధించిన డబ్బులు అందరి ఖాతాల్లో పడుతాయి. కాకపోతే, కొంచెం వెనకా.. ముందు జరుగుతుందని, రైతులు కాస్త సంయమనం పాటించాలన్నారు. అదేవిదంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అమ్ముకున్నారని ఓ సభ్యురాలు సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి, వైస్ చైర్మన్ బాలాజి సింగ్, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News