Tuesday, 21 April 2026 03:26:36 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు - జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన - నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ సర్వ సభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ క

Date : 30 January 2024 02:05 PM Views : 1230

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : పట్టణంలోని ఎస్ జే ఆర్ ఫంక్షనల్ హాల్ లొ సోమ వారం జడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి ఆధ్వర్యం లో నిర్వహించిన జిల్లా సర్వ సభ్య సమావేశం లో ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశి క్రిష్ణ మాట్లాడుతూ ఒక్కో రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రగతిని సాధిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్, సంబంధిత సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా డాక్టర్, ఇంకా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు అధికారులను కోరారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుబంధు'కు సంబంధించి కొందరు రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో పడడం లేదని, సమస్య ఎక్కడ ఉందో పరిష్కరించాలని సభ్యులు కోరారు. రైతుబంధుకు సంబంధించిన డబ్బులు అందరి ఖాతాల్లో పడుతాయి. కాకపోతే, కొంచెం వెనకా.. ముందు జరుగుతుందని, రైతులు కాస్త సంయమనం పాటించాలన్నారు. అదేవిదంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అమ్ముకున్నారని ఓ సభ్యురాలు సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి, వైస్ చైర్మన్ బాలాజి సింగ్, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :