Friday, 16 January 2026 09:19:39 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

సిఎంఆర్ ఇవ్వని మిల్లులపై పీడియాక్ట్ కేసులు నమోదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి జిల్లా కలెక్టర్

సి ఎం ఆర్ చెల్లింపులో జాప్యం వహించిన మిల్లర్లపై ఆగ్రహాం..!!

Date : 30 December 2023 06:07 PM Views : 986

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఎఫ్స సీ ఐ కి సకాలంలో అందించకుండా పెండింగ్ పెట్టుకున్న రైస్ మిల్లర్‌లపైన పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కస్టమ్ మిల్లింగ్ రైస్/ సిఎమ్‌ఆర్ డెలివరీ ప్రక్రియ పై మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు సకాలంలో సీఎమ్మార్ అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్న వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆయా రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి, నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో సిఎమ్‌ఆర్ పెండింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కల్వకుర్తి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి పారాబైడ్ రైస్ మిల్ ఇప్పటివరకు ఒక ఏసీకే కూడా ఎఫ్ సి ఐ కి అందించకుండా 13 ఏసీకేలు పెండింగ్లో ఉండడంపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సీతారామాంజనేయ ఇండస్ట్రీట్ గుడిపల్లి 162 ఏసీకేలు పెండింగ్ ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50% పెండింగ్ ఒకే మిల్లులో ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తనిఖీలు నిర్వహించి ధాన్యాన్ని పరిశీలించాలని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పది రైస్ మిల్లుల వద్ద పెండింగ్లో ఉన్న 324 ఏసీకేలను ఎఫ్ సి ఐ కి అందించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2022-/23 యాసంగి, వానా కాలం సీజన్ కింద 92 వేల 897 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించాల్సి ఉండగా 43064 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐకి అందించారని, 49833 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇంకా అందించాల్సి ఉందని అందించకపోవడంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రానున్న 15 రోజుల్లో 100% ఎఫ్సీఐకి సీఎంఆర్ బియ్యాన్ని అందిస్తామని కలెక్టర్ కు మిల్లర్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వం గతంలోని డిసెంబర్ 30 వరకు డెడ్ లైన్ విధించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. అధిక శాతం పెండింగ్లో ఉంచుకున్న మిల్లర్ల నుండి ఇతర మిల్లర్లకు వరి ధాన్యాన్ని బదలాయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా సివిల్ సప్లై అధికారి స్వామి కుమార్, డిఎం సివిల్ సప్లై బాల్ రాజ్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు జూలూరి రమేష్, అసోసియేషన్ కార్యదర్శి రవి కుమార్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :