Tuesday, 21 April 2026 03:20:14 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

మిల్లర్లు బియ్యాన్ని వెంటనే ఎఫ్ సిఐ కి సరఫరా చెయాలి : జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

Date : 08 January 2024 10:09 PM Views : 935

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / Hyderabad : నాగర్ కర్నూల్ జిల్లాలోని రైస్ మిల్లులు వారి రోజువారీ మిల్లింగ్ సామర్థ్యం మేరకు మిల్లింగ్ చేసి కేంద్ర ఆహార సంస్థకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సి.యం.ఆర్ ధాన్యం సేకరణ, ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన ద్వారా స్వీకరించిన అభయ హస్తం దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకొని మిల్లింగ్ చేయకుండా ఎఫ్.సి.ఐ కి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకపోవడం వల్ల రాష్టానికి ఆర్థిక ఇబ్బందులూ వస్తున్నాయని, జనవరి 31 లోగా ఆయా జిల్లాల వారీగా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎఫ్.సి.ఐ కి అందించే విధంగా రోజువారీ కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడైనా పి.డి.ఎస్. బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు వారి సామర్థ్యం మేరకు మిల్లు ఆడించి యుద్ధప్రాతిపదికన ఎఫ్.సి.ఐ. సివిల్ సప్లై కు బియ్యం ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సివిల్ సప్లై అధికారులను ఆదేశిస్తూ రైస్ మిల్లులు తమ సామర్థ్యం మేరకు మిల్లింగ్ చేసి ఎరోజుకు ఆరోజు ఎఫ్.సి.ఐ . కి బియ్యం పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేసే మిల్లుల పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా సేకరించిన అభయ హస్తం దరఖాస్తులను డిజిటల్ లైజేశన్ చేసే ప్రక్రియ నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అన్ని దరఖాస్తులు ఆన్లైన్ లో అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్, ఇతర కార్యదర్శులు పాల్గొనగా జిల్లా నుండి అదనపు కలెక్టర్ కే. సీతారామ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, డి.యం. బాలరాజ్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :