Tuesday, 21 April 2026 03:27:01 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

ప్రజల కోసం పనిచేస్తాం.. ఒక్క గంట కరంటు ఆగినా వెంటాడుతాం.. వేటాడుతాం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తైలం అరుణ్ కుమార్

Date : 04 December 2023 08:14 PM Views : 647

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుబంధు ఇవ్వాలి వ్యవసాయం ఆగొద్దు, గెలిచినప్పుడు ఎగరలేదు ఓడినప్పుడు బాధపడను నా ఓటమి నన్ను బాధపెట్టలేదు .. నేను ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోను అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం బాగా కలచివేసిందని ఆలా జరిగి ఉండాల్సిది కాదన్నారు. రాష్ట్ర సాధనలో ఎలాంటి పాత్ర లేనివారు 10 ఏండ్ల తరువాత ఒక మంచి నాయకుడిని ఓడించాలన్న కసి కనిపించిందని, ప్రధాన మంత్రి గా పోటీ చేసిన ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ఎందరో సిఎం అభ్యర్థులు కూడా ఓడిపోయారని గుర్తు చేశారు. ఓడిపోయామని ఎక్కడికి వెళ్లను ఇక్కడే ఉంటా గ్రామాల్లో తిరుగుతా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తామని భీమా వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో మనసు పెట్టి చేసిన అభివృద్ధి 100 ఏండ్ల భవిష్యత్తు కు సంబందించిన పని అది ప్రజల కండ్ల ముందు ఉన్నదన్నారు. సుమారు సంవత్సర కాలం నుండి పార్టీలో ఉండి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేశారని, రేపు వాళ్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు అందులో ఉండే కష్ట నష్టాలు తెలుస్తాయన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ వాళ్లు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోస పోయాము అనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు. నాలుగు ఐదు నెలలో ప్రజలకు నిజం తెలుస్తుంది. ప్రజలకు అర్థం అయ్యే వరకు జరిగే నష్టం మొత్తం జరిగిపోతుంది. ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పకుండా వ్యక్తిగత కక్షలతో ఉన్నవారు విజయాలను సాధించలేరన్నారు. 100 ఏండ్ల తరువాత పారుతున్న కాల్వలు పండుతున్న పంట పొలాలు, కనిపిస్తున్న విద్యాసంస్థలు, ఏదుల రిజర్వాయర్, మార్కెట్ యార్డు మమ్మల్ని గుర్తు చేస్తాయన్నారు. నన్ను మరిపించడం ఎవరి తరం కాదు నాలుగు ఐదు సార్లు ఉన్నవాళ్లు కూడా చేయలేని పనిని చేశానన్నారు. గుడ్డిగా వ్యతిరేకించడం మాకు తెలియదు హుందాగా రాజకీయాలు చేసినం, చేస్తాం అన్నారు. ఫలితాలను సమీక్షించుకుంటాం .. ప్రజల కోణం తెలుసుకుంటామని, వ్యవసాయ శాఖ మంత్రి గా చేసిన నా మీద బాధ్యత ఉండే 90 శాతం రైతు రుణమాఫీ చేసినం, రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఎన్నికలు ఉన్నాయని రైతుబంధు ఇవ్వకుండా ఆపివేశారని యాసంగి సీజన్ ఎన్నికల కోసం ఆగదు 75 లక్షల మంది రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేలు ఇవ్వాలి, మిగిలిన రైతు రుణమాఫీని వారం రోజుల్లో పూర్తి చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా డిమాండ్ చేశారు. నియోజకవర్గం లో పార్టీ కోసం పని చేసిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు తిరుమల మహేష్, జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా శిక్షణ తరగతుల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్లు, ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :