Tuesday, 21 April 2026 03:24:36 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు..వాకిటి శ్రీహరి గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు.

తిరుపతి వెంకటేష్..

Date : 04 December 2023 07:41 PM Views : 427

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నారాయణపేట : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మార్పుకే మఖ్తల్ ప్రజలు పట్టం కట్టారని బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి అన్నారు. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు విజయం కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన కాంగ్రెస్ ,ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మఖ్తల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో అఖండ మెజార్టీని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం మఖ్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అంతకుముందు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధికి గత ఎమ్మెల్యే ఎంత మాత్రం పాటుపడలేదని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెద్దపీట వేస్తోందని అన్నారు. పేద ప్రజల నేస్తం కాంగ్రెస్ పార్టీ అన్నది వాస్తవమని అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిష్కరించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 శాతం అమలు చేసి తీరుతామని గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేదే చెబుతుంది చెప్పింది చేసి చూపిస్తుందని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండు నెలల క్రితం చిట్టెం కో హటావో మఖ్తల్ కో బచావో అనే నినాదంతో ముఖ్యమైన నాయకులంతా కలిసి సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసి ముందడుగు వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరికి టికెట్ వచ్చిన గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ప్రధాన డిమాండ్ చిట్టెం కో పటావో మక్తల్ కో బచావో అమలు చేసి తీరాలని చేసిన తీర్మానం మేరకు వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ టికెట్ వచ్చాక టికెట్ కోసం పోటీపడిన వారిలో తనతో పాటు మొత్తం ఏడు మంది పార్టీ నాయకులు కార్యకర్తలుతో కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని అన్నారు.

Tirupathi venkatesh

Reporter

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :